ఏలూరులో జిల్లా DRC సమావేశం-పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు|VIIDDURAMEDIA
Автор: Viiddura Media
Загружено: 2026-02-07
Просмотров: 61
Описание:
దెందులూరు/ఏలూరు 07.02.2026
ఏలూరులోని కలెక్టర్ కార్యాలయం లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించి , ఆయా అంశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు..
గతంలో డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ద్వారా జరిగిన సీడ్ అంశంలో ఉన్న అక్రమాలపై విచారణ జరపాలని గతంలో జరిగిన డిఆర్సి సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి కోరగా ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చరల్ శాఖ అధికారులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి తెలిపారు.. అదేవిధంగా యూనివర్సిటీ సభ్యులతో పాటు ఉద్యానవన శాఖ అధికారులతో కావలసిన ఒక కమిటీ ఈ అంశాలపై విచారణ చేస్తుందని తెలిపారు. అయితే ఈ అంశంపై దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు స్పందిస్తూ అక్రమాలు జరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారని సమస్యను తీసుకువస్తే ఉద్యానవన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ అంశంలో అలసత్వం ప్రదర్శించారని కమిటీ విచారణలో సైతం స్వయంగా పాల్గొనకుండా తూతూ మంత్రంగా తన సిబ్బందిని పంపించి విచారణ క్రమాన్ని పూర్తి చేయాలని చూడటం అధికారులు అలసత్వానికి నిదర్శనమని రైతుల అంశంలో అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించబమని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు.. రైతుల నుంచి కొబ్బరికాయలు కొని సీడ్ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అసలు నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా సత్వరమే నివేదికలో పూర్తిచేసి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు
అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో నకిలీ ధృవపత్రాలతో కొందరు గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన అంశంపై విచారణ చేసే నివేదిక అందించాలని గత DRC సమావేశంలో కోరగా, ఈ సమావేశంలో సంబంధిత గృహ నిర్మాణ శాఖ అధికారులు వివరణ ఇస్తూ దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపిన ఆరోపణలో వాస్తవమే అని తమ విచారణలో తేలిందని, పెదవేగి మండలం సహ పలు ప్రాంతాల్లో పలువురిని ఈ విధంగా నకిలీ ధ్రువపత్రాలతో హౌసింగ్ లోన్లు పొంది ప్రభుత్వ సొమ్మును పొందినట్లు తెలిసిందని వారికి ఇప్పటికే తాఖీదులు జారీ చేశామని వారిపై చర్యలు చేపడతామని తెలిపారు..
అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఏలూరు నుంచి పంగిడిగూడెం మరియు ఏలూరు నుంచి పెరికిడు వెళ్లే రహదారులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని ఈ రోడ్ల నిర్మాణం నిర్వహణ గుత్తేదారు ఒకరే అవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ndb నిధుల ద్వారా చేపట్టిన పలు పనులు సత్వరమే పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని, అదేవిధంగా కొల్లేరు ప్రాంతంలోని గ్రామాల్లో గతంలో మంజూరైన బీటీ రోడ్లను రిపేరు చేస్తుంటే కూడా ఫారెస్ట్ నిబంధనలు పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు.
దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ పాపికొండల వద్ద టూరిజంను అభివృద్ధి చేస్తే ఏలూరు జిల్లా టూరిజం పరంగా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అయితే పోలవరం ప్రాజెక్టు నుంచి పాపికొండల వద్దకు రహదారి నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఇందుకు ఫారెస్ట్ శాఖ అనుమతులు పొంది ముందుకు వస్తే పోలవరం ప్రాజెక్టు వద్ద ఏలూరు జిల్లా పరిధిలో అత్యంత సుందరమైన టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని తెలిపారు.. దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారి సుధీర్ గారు మాట్లాడుతూ ఫారెస్ట్ పరిధిలో రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని కనెక్టివిటీ రోడ్లు కూడా అవసరమైన మంజూరు అంశాలను నివేదికగా సమర్పిస్తామని తెలిపారు..
అదేవిధంగా రైతులకు సంబంధించి తమ వద్ద మేజ్ ఉన్నవారు రైతు సేవ కేంద్రాల్లో అగ్రిమెంట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ఎంతోమంది రైతులతో ఇప్పటివరకు కంపెనీలు కనీసం అగ్రిమెంటు అవ్వకపోవడం సరికాదని, అగ్రిమెంట్ అవ్వకుండా డ్రైయర్లకు వెళ్లే విధానాన్ని అడ్డుకొని ప్రతి అంశం కూడా రికార్డెడ్ గా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే ప్రతి ఆర్ఎస్కే కేంద్రాల్లో కూడా అందుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఈ విధంగా అగ్రిమెంట్ లేకుండా డ్రైయర్ కి మేజ్ వెల్లే విధానానికి అడ్డుకొని ప్రతిదీ రికార్డెడ్గా జరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు సూచించారు
వీటితోపాటు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించి ఆయా అంశాలను ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా సత్వరమే పరిష్కరించేలా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు
ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గారు సహా పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: