Telangana Ministers Press Meet | తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ | Gnp
Автор: Gnp Telugu YouTube
Загружено: 2026-02-26
Просмотров: 25
Описание:
Telangana Ministers Ponguleti Srinivasa Reddy, Ponnam Prabhakar, Gaddam Vivek Venkatswamy, MPs Balaram Nayak, Ramasahayam Raghuram Reddy, MLAs Rajender Reddy, Madhava Reddy
తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డి
పేదల ఆశీర్వాదంతో నిలబడిన ప్రభుత్వం మాది, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టదు.
నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సహచర మంత్రులు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డి
ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నాం అని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన బిఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం పేదల ఆశీర్వాదంతో నిలబడింది. నిజమైన ఏ పేదవాడిని ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు.
2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించింది. అంతేగాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది.
ఈవిషయంలో నిజంగా పేదలపై ప్రేముంటే బిఆర్ఎస్ నాయకులు, బావ మరుదులు, ఫాంహౌస్ లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్ గారు వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలి.
తెలంగాణలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు అసూయతో పసలేని ఆరోపణల చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతున్న తీరు అత్యంత హాస్యాస్పదం.
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పారు.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో పేదవాడి కష్టాలను చూసి చలించిపోయారు. గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పంట పొలాలకు మళ్లించాలని జలయజ్ఞం చేపట్టారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే తుమ్మిడిహట్టి (ప్రాణహిత-చేవెళ్ల) ప్రాజెక్టును రూపకల్పన చేశారు.
గత పదేళ్ల దొరల పాలనలో కేవలం కమిషన్ల కోసం, సొంత అకౌంట్లు నింపుకోవడం కోసం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసి, అందులో కూడ 50 టీఎంసీలు సముద్రం పాలు చేశారు.
రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా, నాలుగు ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 112 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారు. నిర్వహణ కోసం 8500 మెగావాట్ల విద్యుత్ ఖర్చుతో నిర్మించిన ఈ ఎనిమిదో వింత ఏడాదికే కుంగిపోయింది, లీకేజీలతో దర్శనమిస్తుండడం నిజంగా దురదృష్టకరం.
మా ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేశాం, అసెంబ్లీలో చర్చించాం, విచారణ చేశాం, కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరాం.
కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన ప్రధాని, కేంద్ర మంత్రులు.. నేడు విచారణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఘోష్ కమిటీ నివేదికను మేము సీబీఐకి అందజేసినా, నేటికీ స్పందన లేదు. కేంద్రం తీరు వల్ల బిజెపి-బిఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతోంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏండ్ల పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రం నెత్తిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. అయినా కూడా రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కేవలం రెండేళ్ల పాలనలోనే రాబోయే పది సంవత్సరాలకు సరిపడా అభివృద్ధిని చేసే దిశగా కార్యచరణ రూపొందించుకుని పరిపాలన సాగిస్తోంది.
పెయిడ్ ఆర్టిస్టులతో, పింక్ యూట్యూబ్ ఛానళ్లతో విషప్రచారం చేయడం మానుకోవాలి. అటువంటి దిగజారుడు రాజకీయాలు తెలంగాణకు మేలు చేయవు.
వచ్చే మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తోపాటు, కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకావాలి. ప్రాజెక్టుల విధ్వంసంపై, నీటి వాటాలపై ముఖాముఖి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము.
ప్రతిపక్ష నేతలకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, విషం చిమ్మడం ఆపి.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని మీడియా వేదికగా కోరడం జరిగింది.
/ @gnp24x7
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: