మంగళగిరిలో వైసీపీ రిలే నిరాహార దీక్షలు | మెగా డీఎస్సీ అవకతవకలపై తీవ్ర ఆందోళన
Автор: Political Bang
Загружено: 2026-08-06
Просмотров: 1
Описание:
గుంటూరు జిల్లా
మంగళగిరి
మెగా డీఎస్సీ అవకతవకలపై వైసీపీ రిలే నిరాహార దీక్షలు
మంగళగిరిలో ప్రారంభం... ఆగస్టు 10న భారీ ర్యాలీకి పిలుపు
మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి.
మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షను ప్రారంభించారు. తాడేపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు తరలివచ్చి డీఎస్సీలో జరిగిన మోసాలు, విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ మరియు విద్యార్థి విభాగ అధ్యక్షుడు పులగం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, తాడేపల్లి మండల అధ్యక్షుడు అమర నాగయ్య అధ్యక్షత వహించారు.
నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదనమోహన్ దీక్షను ప్రారంభించారు.
ఈ రిలే నిరాహార దీక్ష మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఇన్చార్జి దొంతి రెడ్డి వేమారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దురుద్దేశపూరిత విధానాలను అరికట్టడానికే ఈ నిరసన. ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అన్నారు.మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ తమ పని అయిపోయిన తర్వాత జీవోలను మళ్లీ యథాస్థితికి తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అని ఆరోపించారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలని, ప్రజల ముందుకు వచ్చి జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరారు.ఆగస్టు 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో జరగబోయే అన్ని కార్యక్రమాలను యువత, విద్యార్థి లోకం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, ప్రజానీకం ఈ దుర్మార్గ పరిపాలనను గమనించాలని విజ్ఞప్తి చేశారు.ఈ దీక్షలు చేపట్టిన వ్యక్తులు యువజన విద్యార్థి విభాగానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, షేర్ ఖాన్, తేజ, పృద్వి, నాగేశ్వరరావు, ఏసుబాబు, కోటేశ్వరరావు, డేవిడ్, సురేంద్ర, చిన్ని, చలపతి ,షాలెమ్ ఈ కార్యక్రమంలో పట్టణ,మండల అధ్యక్షులు, వైయస్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: