కరుణాపురం చర్చి
Автор: BSK The Traveller
Загружено: 2025-08-30
Просмотров: 8490
Описание:
క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం.... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో అద్భుతంగా నిర్మించారు. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేయగా.... మే 4, 2023 ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి రూ. 70 కోట్లు ఖర్చు చేయగా...రెండంతస్తుల్లో హాల్ను రూపొందించారు. ఇప్పటికే ఈ చర్చిని... ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా చెబుతున్నారు నిర్వహకులు. అయితే తాజాగా ఈ చర్చికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను క్రీస్తు జ్యోతి ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పాల్సన్ రాజ్ తో పాటు జయ ప్రకాష్ వివరించారు.
కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్ధన మందిరం ఆసియాలోనే అతిపెద్ద చర్చి నిర్మాణమని వారు తెలిపారు. ప్రార్ధన మందిరానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం అదృష్టమని అన్నారు. ఈ చర్చిలో ఒకేసారి 40వేల మంది ప్రార్థన చేసుకోవచ్చని... ఈ అద్భుతమైన చర్చిని మే 4 ,2023న ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మేరకు తమ సేవను గుర్తించి రెండు అంతర్జాతీయ అవార్డులు వరించాయన్నారు . జూన్ 16వ తేదీన 'పీస్ ప్రైజ్ 2023'ను యూ.స్ కాంగ్రెస్ మెన్ డానీ కే. డేవిడ్ చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు. ఇక 'యూ.స్ హౌస్ అఫ్ రెప్రజెంటివ్ కాంగ్రెస్ నల్ అవార్డు మెడల్'తో పాటు ప్రశంసా పత్రాన్ని యూ. స్ ఎంపీ జూన్సన్ జాక్సన్ చేతుల మీదుగా అదుకున్నట్లు వివరించారు. తమ కృషికి అంతర్జాతీయ గుర్తింపు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందించిన అమెరికా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
కరుణాపురం చర్చి #christhujyothiministrieslive #paulsonrajkarunapuram #asia’slargestchurch #karunapuram #pastorjayprakashgaru #worldbiggestchurch #christhujyothiprayerhallsongs
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: