దామోదర్ రెడ్డి జన్మనిస్తే, మంత్రి ఉత్తమ్ పునర్జన్మ నిచ్చారు: సూర్యాపేట డిసిసి గుడిపాటి నరసయ్య
Автор: మన వెలుగు న్యూస్ mana velugu news
Загружено: 2025-11-23
Просмотров: 2471
Описание: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో కలిసి నూతన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన గుడిపాటి నరసయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు.మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జీవం పోస్తే, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పునర్జీవం పోసారని డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా గుడిపాటి నరసయ్య తెలిపారు.సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలను స్థానిక సంస్థల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.జిల్లా అధ్యక్ష పదవి బాధ్యత నాకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. నా గురువు గారు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాకు జెడ్పిటిసిగా, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. రాజకీయాలకు వచ్చిన దగ్గర నుండి ఎన్నడూ కూడా సుఖపడిన సందర్భాలు లేవని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, తుంగతుర్తి పిఎసిఎస్ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా నాయకులు రేగటి రవి, తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, జై బాబు జై భీమ, జై సమిధన్ కోఆర్డినేటర్, మాచర్ల అనిల్ కుమార్, మహిళా మండల అధ్యక్షురాలు పులి సత్తెమ్మ, కాంగ్రెస్ నాయకులు అజయ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: