బులెటిన్ న్యూస్ తెలంగాణ - Bulletin News Telangana -19-12-2025
Автор: Kesava Tv
Загружено: 2025-12-19
Просмотров: 116
Описание:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవరి వైపు ఉందో తెలుస్తుందన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి, ఎన్నికల నాటి విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
-----------------------------------------------------------------------------------------------------------------------
పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆమె ముందుగా భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక కే కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపుకు గురికాని పిచ్చుకులపాడు, కన్నాయుగూడెం, ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేసారని, ప్రజల ప్రయోజనాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు
-----------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్ ఆస్పత్రి వద్ద హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం వెళితే వెంటిలేటర్ ఖాళీగా లేదంటూ డాక్టర్ సమాధానం ఇచ్చింది. అడ్మిట్ చేసుకోలేమని వెంటిలేటర్లు ఒక్కటి కూడా ఖాళీగా లేవని చెప్పింది. వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించింది. దీంతో తమకు ఏమీ తెలియదని దయచేసి వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని రోగి బంధువులు డాక్టర్ కాళ్లు పట్టుకున్నారు. అయినా తనను ముట్టుకోవద్దు అంటూ డాక్టర్ సమాధానం ఇచ్చింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ కు వచ్చామని తమ వద్ద డబ్బులు లేవనే నిమ్స్ కు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతపెద్ద ఆస్పత్రిలోనే ఆక్సీజన్ అందుబాటులో లేకపోతే మరెక్కడికి వెళతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడకు వెళ్లినా మనిషి బ్రతుకుతాడు అనే గ్యారెంటీ లేదన్నాడు.
-----------------------------------------------------------------------------------------------------------------------
జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి ‘వికసిత్ భారత్ జి.రామ్.జి’ పేరిట కొత్త పథకాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రాలు, గాంధీపై పాటలతో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపడతామని వెల్లడించారు
-----------------------------------------------------------------------------------------------------------------------
సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేపడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. అసమర్థుడి జీవయాత్రలా కేటీఆర్ టూర్లు ఉన్నాయని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: