|Sri Venkateswara Bhakta Samaj has sent ten tons of vegetables as the 238th installment| |CNEWS|
Автор: C NEWS VIJAYAWADA
Загружено: 2026-03-03
Просмотров: 16
Описание: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం విశేష సహకారం అందిస్తోంది. ఇప్పటివరకు 238 లారీల ద్వారా పది టన్నుల చొప్పున కూరగాయలను సమర్పించడం జరిగిందని సమాజం సభ్యులు ఈశ్వరరావు తెలిపారు. భక్తుల సహకారంతో అందించిన ఈ కూరగాయల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 238వ విడతగా పది టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు సునీల్ కుమార్ సరాఫ్ దాతగా సహకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమాజం సభ్యులు ఈశ్వరరావు, నాటి నుంచి నేటి వరకు దాతల సహకారంతో శ్రీవారి సన్నిధికి చేరుకునే భక్తుల కోసం అన్నదానానికి అవసరమైన కూరగాయలను నిరంతరం పంపిస్తున్నామని తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ, దాతల స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి ఈ పవిత్రమైన సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేయడం మహోన్నత సేవ అని పేర్కొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: