"మారిపోయిన మనిషి" (కష్టం చేయడంలో తప్పు లేదని, పాతకాలపు పట్టింపుల కంటే ఆత్మగౌరవంతో కూడిన శ్రమ గొప్పది
Автор: కథ కాలక్షేపం
Загружено: 2026-02-12
Просмотров: 2038
Описание:
"మారిపోయిన మనిషి" (కష్టం చేయడంలో తప్పు లేదని, పాతకాలపు పట్టింపుల కంటే ఆత్మగౌరవంతో కూడిన శ్రమ గొప్పదని )
కస్తూరి శేషయ్య అపర కుబేరుడైన అమరయ్య మనవడు. ఆస్తి కరిగిపోయినా ‘పరువు’ అనే అహంకారం మాత్రం తగ్గలేదు. భార్య రామసుబ్బమ్మ కుటుంబం గడవడానికి 'ఇడ్లీల వ్యాపారం' చేస్తానంటే, అది వంశ గౌరవానికి తక్కువని భావించి ఆమెను కొట్టబోతాడు. చివరకు ఆమె దాచుకున్న 600 రూపాయలు దొంగిలించి, కాశీలో గంగమ్మ ఒడిలో ప్రాణాలు వదలాలని ఇంటి నుండి పారిపోతాడు.
కాశీ చేరిన శేషయ్య, ప్రాణ త్యాగం చేయడానికి ధైర్యం సరిపోక వాయిదా వేస్తూ ఉంటాడు. తీరా ఒకరోజు నదిలో దూకబోతుండగా, పోలీసులు అతన్ని పట్టుకుంటారు. ఆ సమయంలో జరిగిన ఒక దొంగతనం కేసులో శేషయ్యను పొరపాటున నిందితుడిగా భావించి, అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
జైలులో రాళ్లు పగలగొట్టడం, నీళ్లు తోడడం వంటి కఠిన శ్రమ చేస్తూ శేషయ్యకు 'కాయకష్టం' విలువ తెలుస్తుంది. తోటి ఖైదీల గాథలు విన్నాక, తన భార్య కష్టపడతానంటే తాను అడ్డుపడటం ఎంత తప్పో అర్థమవుతుంది. అహంకారం నశించి, తన తప్పుకు పశ్చాత్తాపం చెందుతాడు. చివరికి జైలులో వంటవాడిగా మారి అందరి మన్ననలు పొందుతాడు.
శిక్ష పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన శేషయ్య, తన ఊరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక హోటల్లో తిని, డబ్బులు లేక (సహవాస దోషంతో) అలవాటుగా పారిపోబోతాడు. అప్పుడు ఆ హోటల్ యజమానురాలు అట్లకాడ పట్టుకుని కొట్టడానికి వస్తుంది. తీరా చూస్తే ఆమె మరెవరో కాదు.. తన భార్య రామసుబ్బమ్మ! కూతురు కమల పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి ఆ హోటల్ నడుపుతుంటుంది.
ఒకప్పుడు పని చేయడం పరువు తక్కువ అని భావించిన శేషయ్య, తన భార్య కష్టపడి సంపాదించిన గౌరవాన్ని చూసి నివ్వెరపోతాడు. "పారిపోయిన మనిషి కాదు, మారిపోయిన మనిషి" అని రామసుబ్బమ్మ అనడంతో కథ సుఖాంతమవుతుంది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: