Nandavaram Jyothulu Song- 01 | skgs channel
Автор: SKGS CHANNEL
Загружено: 2020-02-05
Просмотров: 274270
Описание:
హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చంద్రవంశీయులు కాలక్రమేణా బలహీనపడి దక్షిణ భారతానికి వచ్చారు.నందవరాన్ని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ఉన్న విఠలాపురం,అప్పలాపురం,వెంకటాపురం అనే అష్ట పురాలను కలుపుకుని జనరంజకంగా పాలన సాగించారు.వారిలో ఒకరైన ఉత్తంగభుజుడు సతీసమేతంగా అహోబిల క్షేత్రాన్ని సందర్శించగా స్వప్నంలో నారసింహుడు కనిపించి చరిత్రలో నిలిచిపోయే పుత్రుడు జన్మిస్తాడని అశీర్వదించాడట.ఆ వరప్రసాది పేరు నందుడు.తీవ్ర జపతపాల ద్వారా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని నిత్యం కాశీ విశ్వనాధున్ని సేవించాలన్న కోరిక అడగ్గా దత్తాత్రేయుడు మంత్ర పాదుకల్ను అనుగ్రహించాడు.
నిత్యం పాదుకలు ధరించి సూర్యోదయానికి ముందే కాశీనాధున్ని సేవించి తిరిగి వచ్చేవాడు.నిత్యం ఒక సమయంలో అంతర్ధానమవుతున్న రాజు ను గమనించిన రాణి నిలదీసింది.రాజు రాణితో సహా కాశీపతిని సేవించి తిరుగుప్రయాణానికి సన్నద్దమయ్యాడు.ఈలోగా రాణికి రుతుక్రమం జరిగింది.పాదుకల మంత్రశక్తి పోయింది.ఇక తిరిగి రాజ్యం చేరాలంటే ఏళ్లూపూళ్లు పడుతుందో లేక జీవితకాలం లో చేరుకోలేక పోవచ్చు కూడా(అప్పట్లో కాశికి పోయినవారు,కాటికి పోయిన వారు అన్న సామెతౌండేది కదా).విచారిస్తున్న రాజు దగ్గరికి కాశీ బ్రాహ్మణులు వచ్చి అభయం ఇచ్చి పాదుకలకు తిరిగి మంత్రబలం వచ్చేట్లు చేసారు.నందుడు వీడ్కోలు చెబుతూ వారికి కోరిన సాయం ఎప్పుడైనా సరే చేయగలనని మాట ఇచ్చి వచ్చాడు.
కొన్నాళ్లకు కాశీ నగరం చుట్టు పక్కల భయంకర క్షామం సంభవించింది.అక్కడి బ్రాహ్మణులు నందవరం చేరి నందుడికి వారికిస్తా అన్న మాటను గుర్తు చేసాడు.మీకిచ్చిన మాటకు సాక్ష్యమెవరని అడిగాడు నందుడు.కాశీ విశాలాక్షే మాకు సాక్షంటూ ప్రార్ధించారు బ్రాహ్మణులు.కదలివచ్చిన కాశీ విశాలక్షి ని చూసి తపో నిష్టులైన విపులు నిన్ను సాక్షిగా ప�
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: