ప్రజారాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్న గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం|
Автор: Amaravati Prajarajadhani
Загружено: 2026-02-22
Просмотров: 528
Описание:
ప్రజారాజధాని అమరావతిలో గెజిటెడ్ అధికారుల(GO) టైప్-1 నివాస గృహాలకై నిర్మిస్తున్న టవర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా నిర్మిస్తున్న ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 384 మంది గెజిటెడ్ అధికారులు నివాసం ఉండేలా APCRDA ఆధ్వర్యంలో 4 టవర్లను నిర్మిస్తున్నారు. 5.55 ఎకరాల విస్తీర్ణంలో 9.62 లక్షల చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో APCRDA ఈ టవర్లను నిర్మిస్తోంది. S+12 తరహాలో ఈ టవర్లను నిర్మిస్తుండగా..ఒక్కో ఫ్లాట్ 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఫ్లోర్కు 8 ఫ్లాట్లు ఉండేలా టవర్ల నిర్మాణం జరుగుతోంది. పని చేసే ప్రదేశాలలో కార్మికులు అనుసరించాల్సిన ఆరోగ్య భద్రతా(OHS) ప్రమాణాలను ఈ ప్రాజెక్టులో సైతం విజయవంతంగా అమలవ్వడంలో APCRDA పర్యావరణ సామాజిక నిర్వహణ(ESM)విభాగం కీలకంగా పనిచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డా.పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఈ ప్రాజక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు తెలియజేశారు. APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. గారు పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రాజెక్టు పురోగతికి విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా గెజిటెడ్ అధికారులు(టైప్- 1) అధికారుల నివాసగృహాలు నిర్మించి నిర్దేశించిన గడువులోపు అందజేస్తామన్నారు.
#APCRDA #Amaravati #CapitalInfrastructure #AmaravatiGovernmentComplex #GOTowers #AndhraPradesh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: