గోదావరి తీరంలో శివరాత్రి సందడి..పట్టిసంలో భారీ భద్రతా ఏర్పాట్లు | Prime9 West Godavari
Автор: Prime9 West Godavari
Загружено: 2026-02-14
Просмотров: 186
Описание:
#prime9westgodavari #mahashivaratri #bhadrakalitemple #polavaram #elurudistrict #GodavariRiver #AndhraPradeshNews #TempleFestival
ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు స్వామివారికి తొలి పూజ చేసిన తర్వాత సర్వదర్శనానికి అనుమతిచ్చారు. క్యూలైన్లలో బారులు దీరిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి ప్రాముఖ్యత ఉందని, దక్షయజ్ఞ సమయంలో దక్షిణ్ణి సంహరించేందుకు పరమశివుడు వీరభద్రుని పంపేడని, వీరభద్రుడు పట్టిసం అనే ఆయుధంతో దక్షుడిని వధించి ఆయుధాన్ని ఇక్కడ కొండపై దింపాడని, ఆ సమయంలో పరమశివుడు అనుగ్రహంతో వీరభద్రుడు వీరేశ్వర స్వామిగా ఇక్కడ ఉద్భవించారని స్థల పురాణం చెబుతున్నట్లుగా అర్చకులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శిస్తే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం గోదావరి నది దాటి కాలినడకన ఆలయానికి చేరుకునేందుకు పంటూలతో రహదారి ఏర్పాటు అనంతరం ఇసుక తేనెలపై నడిచేందుకు వీలుగా ఇసుక బస్తాలను పరిచారు. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాక ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో పటిష్ట భద్రత చర్యలు చేశారు.
| Subscribe |
| Prime9 West Godavari |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: