17 కళాశాలల్లో 11 నాబార్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 సాస్కి కింద మంజూరయ్యాయని సత్యకుమార్ తెలిపారు
Автор: C NEWS VIJAYAWADA
Загружено: 2026-03-03
Просмотров: 8
Описание:
17 కళాశాలల్లో 11 నాబార్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 సాస్కి కింద మంజూరయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మొత్తం వ్యయం 8,480 కోట్లు అని అన్నారు. జగన్ హయాంలో కేవలం 15 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. అందులో పులివెందుల కళాశాలకే దాదాపు 500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. కళాశాలలు నిర్మించామని వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి విమర్శించారు.పార్వతిపురంలో భూసేకరణ కూడా చేపట్టలేదని అన్నారు.
పది కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు దశల్లో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కారణంగా సీట్ల సంఖ్య 11కి పడిపోయిందని, అయినా బెదిరింపులు ఆపడం లేదని విమర్శించారు. జగన్ ప్రైవేట్ కళాశాలల మాదిరిగా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు ఇచ్చారన్నారు. రాబోయే రెండేళ్లలో పీపీపీ విధానంలో కళాశాలలు పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: