కురుమల చరిత్ర మూలాలు history of kuruma
Автор: Discovery Man
Загружено: 2023-08-23
Просмотров: 37088
Описание:
కురుమలు
*కురుమలు ప్రాచీన పురావస్తు మ్యూజియం నిర్మాతలు.ఈ దేశం మూలవాసులకు వారసులు.
-డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి
కురి అనగ కన్నడంలో గొర్రె. కురుబలు అనగ కురుమలు.వీరినే కురువలు, మహారాష్ట్రలో ధన్ గర్ అంటారు. కర్ణాటకలో కురుమలను గౌడ లేద గావుండ అంటారు. గౌడ అనే మూల ద్రావిడ పదానికి అర్థం పర్వతం. వీరిని పర్వత వాసులు అనవచ్చు. దీనిని బట్టి కురుమల చరిత్ర ఎంతో ప్రాచీనమైనదని చెప్పవచ్చు.
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రాంతాలల్లో ఎక్కువగ కనిపిస్తారు.
నంజుండయ్య కురుబలు పల్లవుల వారసులు. రేణుక తండ్రి గారైన రేణు రాజు వద్ద నంజుండయ్య అనే సైనికుడు ఉంటాడు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కురుబలు విజయనగర సామ్రాజ్య స్థాపకులు .
మల్లన్న మొదటి భార్య పద్మాల దేవి. ఈమె దేవగిరి కి చెందినది కాబట్టి కురుమలు మొదట ఆ ప్రాంత వాసులని అంటారు.
లేపాక్షి దేవాలయంలో తలపై గొంగడి బొంత ధరించిన ధనగర్ శిల్పాలు ఉన్నాయి. కర్రపై చేతిని ఉంచి , చేతిపై గడ్డం ఆనించి ఉంది.చూడదగిన శిల్పం ఇది.
పశువుల మందను పెంపు చేసి పశు పాలకుడు అయ్యాడు.శిలా యుగం నాటి మానవ జీవితంలో గొఱ్ఱెలు మేకలను కాస్తున్న చిత్రాలు గుహలలో కనిపిస్తాయి .పశువుల మందలను కాపాడుకునే ప్రయత్నం లో బాగంగా పులులు ఇంకా ఇతర అడవి జంతువులతో పోరాడాడు. ప్రాణాలు కూడా పోగొట్టుకున్నడు. ఆనాటి ప్రజలు ఈ పోరాట యోధులను శిలలపై ప్రతిష్టించుకున్నారు. గుడి కట్టి పూజలు కూడా చేశారు. ఇవి వీరగల్లు శిల్పాలలో ఒక భాగంగా చరిత్రలో నిలిచిపోయాయి.
కొత్త రాతియుగం నుండి వస్తున్న పశుపోషణ సంస్కృతికి కొనసాగింపుగా కురుమలు గుర్తుకు వస్తారు. తొలి నాల్ల ప్రధాన వృత్తి ఉన్ని సేకరించి గొంగల్లు నేయడం. జంతు చర్మాలను ధరించిన మానవులకు గొంగళి ఆవిష్కరణ గొప్ప ఉపశమనం. గొఱ్ఱెల ఉన్నిని స్వయంగా కత్తిరించడం, నేయడం వీరికి తెలిసిన విద్య.హిందూ మతంలో కనిపించే శైవ సాంప్రదాయం పాటిస్తారు. బీరప్ప వీరి మూల పురుషుడు. ప్రధాన దైవం. అయినప్పటికీ మైలారదేవుడు, మల్లన్న ,మల్లికార్జున స్వామి, విఠలుడు.. ఇలా వివిధ రకాల పేర్లతో దేవతలను ఆరాధిస్తారు. ఎల్లమ్మ మరో ముఖ్యమైన దేవత.శివుని తొలి చెమట చుక్క నుండి బీరప్ప , రెండవ చెమట చుక్క నుండి మల్లన్న జన్మించాడని చెబుతారు.
బీరప్ప గుడి రెండు గదుల నిర్మాణంతో ఉంటుంది. ఒక గుడిలో బీరప్ప తన భార్య కామరతితో కూడి,చేతిలో కత్తి ధరించి గుఱ్ఱంపై దర్శనమిస్తాడు. వారి ముందు భోగన్న అనే గొఱ్ఱెల కాపరి ఉంటాడు. మరొక గుడిలో అక్క మహంకాళిని నిలుపుతారు. గుడిపై శివుడితో పాటు గొఱ్ఱెలను నిలుపుతారు.బీరప్పను అడవిలో నిలుపుకోగా, ఇంటిలో మల్లన్నను కొలుస్తారు. బీరప్ప పండుగలో ఒగ్గు కథ చెప్పే పూజార్లను తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీర్లోళ్లు, రాయలసీమలో గొరవయ్యలు అని వీరిని పిలుస్తారు.ఒగ్గు అంటే జెగ్గు. అనగా ఢమరుకం. ఈ జెగ్గును ఊపుతో కేవలం మౌఖిక సాహిత్యం ద్వారానే సుమారుగా 70 రకాలకు పైగా చరిత్రలను చెబుతారు. పది రోజులపాటు బీరప్ప కథను చెప్తారు. భూమి ఎలా ఆవిర్భవించిందో వీరి జానపద సాహిత్యం చెపుతుంది. ఇదంతా కూడా ఒకరి నుండి మరొకరికి వినికిడి ద్వారా నేర్చుకొని చెబుతూ వస్తున్న సాహిత్యమే.
బీరప్ప పండుగ ఆఖరి రోజుల్లో గారడి విద్యలు ప్రదర్శిస్తారు. గొంగట్లో పేలాలు వేయించుతారు. బీరప్ప కథ చెబుతూ ఒక మామిడి పిక్కను నాటుతారు. దానిపై ఒక గంప బోర్లిస్తారు.కథ ఆనంతరం ఆ గంప తీసి చూడగా మామిడి మొక్క మొలిచి కాయ కాస్తుంది. చెంబెడు నీళ్ళు తాగి, మళ్ళీ నోట్లోంచి నీటిని బయటకు తెచ్చి చెంబును నింపుతారు.
బీరప్ప గుళ్ళు బృహద్ శిలా యుగం నాటి నిర్మాణాలను పోలి ఉంటాయి . ఈ గుళ్ళలో కొత్త రాతి యుగం నాటి రాతి గొడ్డలి, ఇతర పనిముట్లను సేకరించి పెడుతారు. ఇలా కొన్ని వేల కొత్త రాతి యుగం నాటి పనిముట్లు బీరప్ప గుళ్ళలో దర్శనమిస్తాయి. వీటిని" లింగాలు"గా భావించి బండారి (పసుపు) కుంకుమలతో పుదిస్తారు. ఈ కారణంగా బీరప్ప గుళ్ళు తొలి
పురాతన మ్యూజియములు. భావి తరాలకు చారిత్రక ఆధారాల రూపంలో జ్ఞాన సంపదను అందించిన ధన్యజీవులు. పనిముట్ల ఆరాధనా సంస్కృతికి ఆద్యులు.
కురుమ గొల్లలకు పశువుల ఆరోగ్య స్థితి గతులు తెలుసు. గాయ పడినప్పుడు ఆకులతో వైద్యం చేస్తారు. తంగేడు ఉత్తరేణి జిల్లేడు పిప్పళ్ళు మేడి నల్లెడ దుంపలు కూడా వాడుతారు.కాలు విరిగితే నల్లెడ ఇతర ఆకులతో మందు తయారుచేస్తారు. స్వయంగా కట్టు కడుతారు. తేలుకాటుకు ఉత్తరేణి మొక్కను వాడుతారు.
మేకలు గొర్రెల యొక్క అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు పట్టించడం, వాటిని భుజాన మోసుకొని మందతో కదిలి పోతున్న దృశ్యాలు మూగ జీవుల పట్ల వారికున్న ప్రేమను తెలియజేస్తాయి.
వీరు ఉన్ని సేకరించి తయారు చేసిన గొంగడి బొంత 20వ శతాబ్దం వరకు ఎండ వాన చలి నుండి కాపాడుతూ వచ్చింది.
పంటలు కోసిన తరవాత ఆ చేలలో
గొఱ్ఱెలు మేకల మందలు పెట్టడం ద్వారా వాటి మల ముత్రాలతో భూమికి ఎరువు అందుతుంది . ఈ విధంగా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతారు.
గొర్రెల చర్మంతో ఒగ్గు డోలు తయారు చేస్తారు .పట్నాలు వేయడం వీరి సంస్కృతిలో ఒక భాగం. బీరప్ప పట్నాలు మల్లన్న పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు వేస్తారు.
పూర్వము రోజుల్లో మందలు ఏయే తోవలో వెల్లాలో తెలిపే రూట్ మ్యాప్ అని ఒక అభిప్రాయంగా ఉంది.అదే రాను రాను ముగ్గు వలే మారిందని చెబుతారు.పట్నానికి‘మల్లికార్జున స్వామి కల్యాణం’ అనే అర్థం కూడా ఉంది
పాలకుర్తి సోమనాథుని బసవ పురాణం లో "కాట కోటడు "అనే గొల్లవాడు భక్తి భావంతో మేక పెంట్రికను లింగంగా భావించి అభిషేకం చేసిన వృత్తాంతం ఉంది.
*కనకదాసు , హంపన , దొడ్డి కొమురయ్య వంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు
ఐనవోలు కొమురవెల్లి ఓదెల మొదలయిన ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించ దగినవి.
ఇది ప్రాథమిక సమాచారమ్ మాత్రమే.పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: