రాష్ట్ర అభివృద్ధి పనులు శూన్యం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ విమర్శలు..
Автор: DESHABAKTI TELUGU TV
Загружено: 2026-02-20
Просмотров: 158
Описание:
రాష్ట్ర అభివృద్ధి పనులు శూన్యం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ విమర్శలు..
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా శూన్యంగా మారాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వైయస్సార్ పార్టీ నాయకులు సీపీఐ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నిరసన కార్యక్రమానికి వైయస్సార్ పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నబాబు, వైయస్సార్ పార్టీ నాయకులు సుంకప్ప,కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు ఎం. ఫెరోజ్ అలీ ఖాన్, ఆలమ్ నవాజ్, కాంగ్రెస్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి నబీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాలిక్ సాబ్ పాల్గొన్నారు.సీపీఐ నియోజవర్గం ఇన్చార్జ్ గోవిందు,సీపీఐ ప్రధాన కార్యదర్శి గోపీ హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు సమస్యలు, పెరిగిన ధరల భారం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సప్ప, సీనా, రామచంద్ర, షైక్షా, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: