ANGANWADI వేతనాలు పెంచే వరకూ పోరాటం. కొనసాగిన అంగన్వాడీల దీక్షలు. 2న చలో విజయవాడ
Автор: FIRST VOICE OF AP
Загружено: 2026-02-26
Просмотров: 4179
Описание:
వేతనం పెంచాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడోరోజు బుధవారం కొనసాగాయి. ప్రజా సంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. పలుచోట్ల ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు దీక్షలను నిర్వహించారు. పలుచోట్ల ర్యాలీలతో నిరసన తెలిపారు. ఏలూరు, చిత్తూరు జిల్లాలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. మార్చి 2న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడానికి, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రైవేట్ విమానాల్లో తిరగడానికి డబ్బులు ఉంటాయిగానీ అంగన్వాడీల వేతనాలు పెంచడానికి మాత్రం ఉండవా ? అని ప్రశ్నించారు. తొలుత అంగన్వాడీలు జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఆశీలు మెట్ట జంక్షన్, లలిత జ్యూయలర్స్ సెంటర్, గురజాడ విగ్రహం మీదుగా తిరిగి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. దీక్షలకు ఐద్వా, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అనకాపల్లి, అల్లూరి, పోలవరం జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద రిలే దీక్షలు కొనసాగాయి. రిలే దీక్షలనుద్దేశించి కర్నూలులో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి.నిర్మల, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు మనోహర్ మాణిక్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లికార్జున మాట్లాడారు. గతంలో 42 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు దీక్షలు చేసిన సందర్భంగా టిడిపి, జనసేన నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి అంగన్వాడీ హెల్పర్స్ అండ్స్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని పిలిచి చర్చించినప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దీక్షలను ఆపేయాలనడం అత్యంత దుర్మార్గమన్నారు. విజయనగరం, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా కలెక్టరేట్, ఒంగోలు సిటీ కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద, పశ్చిమగోదావరి జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. This Channel about Voice of common people to spread over the world. All videos are about #AndhraPradesh #FirstVoiceofAP
కొత్త కొత్త వీడియోస్ కోసం మా FIRST VOICE OF AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
---------------*----------------*----------------*----------------
Like 👍 , comment, share and Subscribe to your FIRST VOICE OF AP YouTube Channel...
Follow our social media sites...
Facebook : / first VOICE OF AP/
YouTube : / first VOICE OF AP/
Twitter : / first VOICE OF AP/
------------------------*------------------------*---------------
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: